Header Banner

నిశ్చితార్థం నుంచి వస్తూ కారులోనే ఆఖరి ప్రయాణం! 120 కిమీ వేగంతో ..!

  Wed Apr 30, 2025 19:34        Others

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు హైస్పీడుతో ఇంట్లోకి దూసుకెళ్లింది.. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మెడికోలు.. ఓ వ్యక్తి ఉన్నారు. మెడికోలు మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వారంతా మత్తులో ఉన్నారంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

 

వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అతివేగంగా వచ్చిన కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రమణయ్య (50) సహా కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. వీరంతా నారాయణ మెడికల్ కాలేజ్‌లో సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నట్లు పేర్కొంటున్నారు. మృతులు నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన నవనీత్‌ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. ఈ ఘటనలో షాప్‌లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు.

 

ఇది కూడా చదవండిఏపీలో మూడు రాష్ట్రాల్లో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు! మెగా ప్రాజెక్టులకు శ్రీకారం!

 

నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకకు బుధవారం మెడికోలు హాజరయ్యారు. అనంతరం కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా.. ముంబై.. జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిందని స్థానికులు చెప్పారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 120కిమీ ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #nellooraccident #roadtragedy #medicostudents #carcrash #rashdriving